టిఆర్ఎస్కు అవిశ్వాసం పెట్టేందుకు బలం లేదు: మంత్రి శ్రీధర్బాబు
తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. నేను కూడా తెలంగాణవాదినేనని, తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నామని చెప్పారు. అయితే తెలంగాణతో పోరు అంటూ అభివృద్ధిని అడ్డుకోవడం మాత్రం సమంజసం కాదన్నారు. అందరూ తెలంగాణ కోసం ఉద్యమించాల్సిందేనని, అదే సమయంలో అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని చెప్పారు. ఫీజు రీయింబర్సుమెంట్పై విపక్షాలది రాజకీయం అన్నారు. విద్యార్థులకు వెంటనే ఫీజులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఇందుకోసం 16వ తేదిన సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సహాయ నిరాకరణతో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమం సక్సెస్ అయిందన్నారు.
Comments
English summary
Minister Sridharbabu said that TRS has no chance to propose non confidential motion against government. He suggest
TRS to think about this, If have majority. He aslo condemned oppostiones agitations on fees reimbursements. He said
Congress has stand for Telangana. He said we will force on Central for Telangana.
Story first published: Sunday, February 13, 2011, 10:49 [IST]