పార్లమెంటులో బైఠాయిస్తా, తెలంగాణపై తాడోపేడో తేల్చుకుంటా: కెసిఆర్
ఆదివారం 75 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ప్రతినిధులు కేసీఆర్తో భేటీ అయ్యారు. సహాయ నిరాకరణకు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. ఉద్యోగులకు సంఘీభావంగా తెరాస తరఫున గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు. తమ పార్టీలో ఓ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. ప్రతీ జిల్లాలో ఈ టాస్క్ఫోర్స్ ఉద్యోగులకు సహకరిస్తుందని పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులపై ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటే, అణచివేయాలని చూస్తూ తాను ఊరుకోబోనని, మరోసారి దీక్ష చేపడతానని, ఈసారి చుట్టూ 50 వేల మందిని ఏర్పాటు చేసుకొని దీక్ష చేస్తానని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. సహాయ నిరాకరణతో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దిగివస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం.
Comments
English summary
TRS president KCR said, he will stage dharna before speaker in Parliament during budget session, demanding statehood for Telangana. He extended his support to the Telangana Government staff, who are taking up civil disobedience from 16th of this month.
Story first published: Monday, February 14, 2011, 8:57 [IST]