వైయస్పై డిఎల్ ఆరోపణలు జగన్కే లాభం: కేబినెట్ సమావేశంలో వట్టి

వట్టి ఆరోపణలపై స్పందించిన ముఖ్యమంత్రి డిఎల్, శంకర్రావులను వైయస్పై విమర్శలు వద్దని సూచించినట్టుగా తెలుస్తోంది. కాగా రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని సమావేశంలో సిఎం చెప్పారు. తెలంగాణలో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు మంత్రులను సిఎం అభినందించారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్సుమెంట్సుపై ముఖ్యమంత్రి, మంత్రి బొత్స సత్యనారాయణకు మధ్య కాస్త చర్చ జరిగింది. ఫీజుల విషయంలో ఇచ్చిన మాట తప్పకూడదని సిఎంకు బొత్స సూచించినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications