హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కితాబిచ్చిన టిడిపి నేత కడియం

By Srikanya
|
Google Oneindia TeluguNews

Kadiyam Srihari
హైదరాబాద్: నిత్యం పరస్పర విమర్శలు చేసుకునే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం తెలంగాణ విషయంలో ఒకరికొకరు సమర్థించుకుంటూ మాట్లాడారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని, వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారని ప్రత్యర్థి పార్టీ నేతలను ఆకాశానికెత్తారు టిడిపి మాజీ మంత్రి. ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో తెలంగాణపై జరుగుతున్న చర్చా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్దిని శంకించాల్సిన అవసరం లేదని చెప్పారు.

తెలంగాణ కోసమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి మంచి పని చేశారని, అయితే తెలంగాణపై స్పష్టమైన హామీ వచ్చే వరకు వారు ఢిల్లీనుండి రాకుడదని కోరారు. తెలంగాణ కోసం పోరు చేస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలంటే ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్యేలు స్పష్టమైన హామీతో రావాలని, లేదంటే ప్రజలు నమ్మే పరిస్థితి పోతుందని సూచించారు. టిడిపిలోనే కాకుండా అన్ని పార్టీలు ప్రాంతాల వారిగా విడిపోయారని చెప్పారు. టిడిపి తెలంగాణలో విబేదాలు నిజం కాదని చెప్పారు. టిడిపి సీనియర్ నేతలు నాగం జనార్ధన్ రెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య విబేధాలు తలెత్తాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

English summary
TDP senior leader, former minister Kadiyam Srihari praised Telangana Congress MLAs and MLCs today. Kadiyam said there is no doubt about T-Congress MLAs support to Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X