ఎమ్మెల్యేల దాడి సిగ్గుపడాల్సిన విషయం, చీకటి రోజు: సిఎం కిరణ్

Kiran Kumar Reddy
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌పై ప్రజాప్రతినిధుల నిరసన, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై దాడిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఖండించారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం అని చెప్పారు. గవర్నర్‌కు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పారు. ఇది చాలా చీకటి రోజని అన్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు వారి వారి అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉందన్నారు. భిన్న అభిప్రాయాలు వెలువడినప్పటికీ దాడి చేయడం సరికాదని, అయితే ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయాలని అన్నారు.కానీ భౌతిక దాడులు మాత్రం అమానుషమన్నారు. దాడులు చేయడం ఎత్తిచూపే విధంగా ఉంటాయన్నారు. దాడికి క్షమాపణ కోరుతూ తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.

క్లిప్పింగ్సును పరిశీలించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకరు నాదెండ్ల మనోహర్‌ను కోరినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు ఇలా చేస్తారని ఎవరూ ఊహించరని, రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిరసనలు తెలియజేసేందుకు పద్ధతులు ఉంటాయని, అయితే ఈ పద్ధతి మాత్రం ప్రజలు ఆమోదించరన్నారు. అసెంబ్లీ ప్రజల సమస్యల పరిష్కరించడానికి వేదిక అని, అలాంటి వేదికపైన ఇలాంటి చర్యలు ఎవరైనా ఖండించవలసిందేనని చెప్పారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, జెపిపై దాడి నేపథ్యంలో బిఎసి సమావేశం ఏర్పాటు చేశారు. బిఎసిలో దాడిని ముక్తకంఠంగా ఖండించారు. కాగా శాసనసభలో నేటి పరిణామాలపై కేంద్రానికి, అధిష్టానానికి ఫోన్‌లో వివరించినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+