తెరాసపై శివాలెత్తిన కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి

జెపినో, తానో తెలంగాణ ఇచ్చేవారం కాదని ఆయన అన్నారు. తమ అభిప్రాయాలను తాము చెబుతున్నారని, వారి అభిప్రాయాలు వారు చెబుతున్నారని, వారిని తాము ఏనాడు తప్పు పట్టలేదని, వారిని నిందించలేదని ఆయన అన్నారు. ఈ విషయంపై జర్నలిస్టులు కూడా ఆలోచించాలని ఆయన సూచించారు. ఐదు వందల రాష్ట్రాలు ఇవ్వమనండి తమకేమీ అభ్యంతరం లేదని ఆయన అన్నారు. శాస్త్రీయ పద్ధతిలో దేశంలో ఐదు వందల రాష్ట్రాలు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రేపు హైదరాబాద్ రాష్ట్రం కావాలని ఎవరైనా అడిగితే దాన్ని వ్యతిరేకించేవారు ద్రోహులవుతారా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications