హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై సమైక్యవాదులను కాంగ్రెసు ఒప్పించి, జూన్‌లో ప్రకటన?

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తమ పార్టీకి చెందిన సమైక్యవాదులను ఒప్పించి, జూన్‌లో లేదా జులైలో కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తుందనే మాట వినిపిస్తోంది. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు ఈ వాదనను ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా సమైక్యవాదం వినిపిస్తున్న తమ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివ రావులను ఒప్పించేందుకు తమ పార్టీ అధిష్టానం ప్రయత్నాలు సాగిస్తోందని, జూన్ లేదా జులై నెలలో తెలంగాణ అనుకూలంగా ప్రకటన వస్తుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు కె. కేశవ రావు ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో చెప్పారు.

తెలంగాణపై వైఖరి స్పష్టం చేయాలని ఢిల్లీలో నాలుగైదు రోజుల మకాం వేసిన తమ పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలకు కూడా అధిష్టానానికి చెందిన నాయకులు ఇదే విషయం చెప్పారని అంటున్నారు. ముఖ్యంగా, తెలంగాణలో పార్టీకి విజయావకశాలు ఉండేలా పరిస్థితులను సృష్టించి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేస్తోందని చెబుతున్నారు. తెలంగాణ ఇస్తే, ఆ క్రెడిట్ అంతా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు దక్కుతుందని, అలా కాకుండా తమకే ఆ క్రెడిట్ దక్కేలా చూసుకుని కాంగ్రెసు అధిష్టానం ప్రకటన చేస్తుందని ప్రచారం జరుగుతోంది.

English summary
MPS of Congress Telangana region are saying that High command will take decision on Telangana in June or July. It is said that Congress high command is trying convince its Seemandhra MPs for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X