కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుల హెచ్చరిక
లోకసభలో తమకు సంఘీభావం తెలిపిన పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో 48 గంటల బంద్ జరుగుతోందని, సహాయ నిరాకరణ ఉద్యమం సాగుతోందని, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఆ విషయాన్ని తాము కేంద్రం దృష్టికి తేవడంలో విజయం సాధించామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తప్ప మరోదానికి తాము ఆంగీకరించే ప్రసక్తి లేదని తాము ప్రధానికి స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. శాసనసభలో కూడా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు తాము పార్లమెంటులో వ్యవహరించిన తీరులో వ్యవహరించాలని ఆయన కోరారు. గవర్నర్ నరసింహన్ను రీకాల్ చేయాలని తాము ప్రధానిని కోరినట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు తాము ప్రధానికి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు. తాము రెండు గంటల తర్వాత ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలను కూడా అడ్డుకుంటామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.