తెలంగాణ నినాదాలు: టిఆర్ఎస్, బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అనంతరం పలువురు తెలంగాణకు చెందిన టిడిపి, సిపిఐ, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో చంద్రవతి, మల్లేష్, సాంబశివరావు, భారతీయ జనతా పార్టీకి చెందిన లక్ష్మీనారాయణలను కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన కొద్ది సేపటికే సస్పెండ్ చేశారు. కాగా గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకున్న హరీష్ రావుతో పాటు మరో ఇద్దరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎనుముల రేవంత్ రెడ్డి, మహేందర్ రెడ్డిని శుక్రవారం సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications