కాంగ్రెసు తెలంగాణ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన హరీష్ రావు

Harish Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులను టార్గెట్ చేశారు. శాసనసభ సమావేశాలను స్తంభింపజేయడానికి తమతో కలిసి రావాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు తమ ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తాకట్టు పెడుతున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని, తెలంగాణ కోసం శాసనసభా కార్యక్రమాలను స్తంభింపజేయడంలో తమకు సహకరించాలని ఆయన కోరారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత సీమాంధ్ర శాసనసభ్యులు స్పీకర్ పోడియం వద్దకు రాలేదా, పార్లమెంటులో సీమాంధ్ర సభ్యులు ఆందోళనకు దిగలేదా, మీరెందుకు వెనకాడుతున్నారని ఆయన అడిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముందుకు రాకపోతే చరిత్రహీనులవుతారని ఆయన అన్నారు. తొమ్మిది రోజులుగా సహాయ నిరాకరణ జరుగుతోందని, 48 గంటల బంద్ విజయవంతమైందని, ఇవి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులకు కనిపించడం లేదా అని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆయన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రణాళికకు కట్టుబడి పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+