సామాన్యుల కోసమే నా రైల్వే బడ్జెట్: రైల్వే మంత్రి మమతా బెనర్జీ

శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్కు ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలున్నాయి. రాష్టానికి భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తారని భావిస్తున్నారు. పరీక్షల సమయాల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపనున్నట్లు ఆమె ప్రకటించే అవకాశాలున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ మధ్య మల్టీ మోడ్ రవాణా వ్యవస్థను ఆమె ప్రస్తావించే అవకాశాలున్నాయి. ముంబై శివారు రైల్వే వ్యవస్థను పెంచుతారని అంటున్నారు. రైల్వే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న సమయంలో మమతా బెనర్జీ బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నారు. నాగపూర్లో కొత్త పారిశ్రామిక వాడ, గ్రీన్ టాయిలెట్ ఉత్పత్తి కర్మాగారం ఏర్పాటుకు ఆమె ప్రకటన చేయవచ్చు.












Click it and Unblock the Notifications