ఇంటర్ పరీక్షలపై గందరగోళం, ఆందోళన: ఎవరి పట్టు వారిదే

Board of Intermediate
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలపై గందరగోళం నెలకొంది. విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. మిలియన్ మార్చ్ టు హైదరాబాద్ దృష్ట్యా పదవ తేదీ పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) డిమాండ్ చేస్తుండగా, వాయిదా వేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం ప్రకటిస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించకుండా ఈనెల ఏడో తేదీ నుంచి జరిగే ఇంటర్మీడియట్‌ పరీక్షలను వాయిదా వేయాలని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశానంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతీసారి మార్చి రెండోవారంలో ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్‌ పరీక్షలను ప్రభుత్వం ఈసారి మొదటి వారంలోనే ప్రారంభించిందనీ, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలోనే ప్రభుత్వం ఇలా చేస్తున్నట్లు కనపడుతోందన్నారు.

తొలుత ప్రకటించిన విధంగానే ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఈనెల 7 నుంచి జరుగుతాయని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. మార్చి 10న ఇంటర్మీడియేట్‌ ద్వితీయ సంవత్సరం ఆంగ్లం-2 పరీక్ష నిర్వహణలో కూడా ఎటువంటి మార్పు ఉండదన్నారు. 10న 'మిలియన్‌ మార్చ్‌ టు హైదరాబాద్‌' సందర్భంగా ఈనెల 7 నుంచి మొదలయ్యే ఇంటర్‌ పరీక్షలను వాయిదావేయాలని తెరాస డిమాండ్‌ చేసిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. జాతీయ స్థాయి పరీక్షలకు విద్యార్థులు హాజరవుతుంటారని, ఇక్కడ పరీక్షలను వాయిదావేస్తే నష్టపోతారని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయమై తాను ఇప్పటికే తెరాస నేతలతో మాట్లాడినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+