వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టువీడని కెసిఆర్, తెలంగాణ అంశంపై దద్ధరిల్లిన లోకసభ

By Pratap
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై లోకసభ శుక్రవారం కూడా దద్ధరిల్లింది. తెలంగాణ అంశంపై తక్షణ చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుడు కె. చంద్రశేఖర రావు వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. దాన్ని స్పీకర్ మీరా కుమార్ తిరస్కరించారు. అయితే, తెలంగాణపై వెంటనే చర్చ చేపట్టాలని కెసిఆర్ పట్టుబట్టారు. ఆయనకు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) పక్షాలు మద్దతు ఇచ్చాయి. లోకసభ జై తెలంగాణ నినాదాలతో మారుమ్రోగింది. కార్యక్రమాలు స్తంభించడంతో స్పీకర్ మీరా కుమార్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు నోళ్లకు నల్టటి రిబ్బన్లు ధరించి సభకు హాజరయ్యారు. రిబ్బన్లు తీసేయాలని స్పీకర్ వారికి సూచించారు. అయినా వారు వినలేదు. గురువారం రాత్రి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ పార్లమెంటు సభ్యులతో సమావేశమైన విషయం తెలిసిందే. అయితే, ప్రణబ్ ముఖర్జీ వారికి ఏ విధమైన హామీ ఇవ్వలేదు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పారే గానీ ఏ విధమైన హామీ ఇవ్వలేదు. దీంతో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత సజావుగా సాగింది.

English summary
Telangana issue rocked Loksabha today also. TRS member K Chandrasekhar Rao demanded for debate on Telangana issue. Speaker Meera Kumar adjourned Loksabha for 15 minutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X