యూపిఎకు బయటినుండి జయలలిత మద్దతు: ప్రభుత్వంలోకి ములాయం!

Jayalalitha
లక్నో\చెన్నై: అసెంబ్లీ సీట్ల సర్దుబాటు నేపథ్యంలో యూపిఎ ప్రభుత్వంనుండి తాము బయటకు వెళ్లి పోతామని డిఎంకె అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత మద్దతు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యూపిఎ ప్రభుత్వానికి బయటినుండి మద్దతు ఇస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం, ములాయం సింగ్ ఆధ్వర్యంలోని ఎస్పీ ప్రభుత్వంలో చేరి కేంద్రానికి బాసటగా నిలబడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై తన నిర్ణయాన్ని చెప్పేందుకు ములాయం ఆదివారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో చెప్పనున్నారు.

యూపిఎనుండి బయటకు వెళ్లనున్న డిఎంకెకు 18 పార్లమెంటుసభ్యుల సీట్లు ఉండగా, ఎస్పీకి 22 సీట్లు ఉన్నాయి. అంతేకాకుండా తమిళనాడులో కూడా జయలలిత కేంద్రానికి మద్దతును ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అయితే డిఎంకే పూర్తిగా యూపిఎనుండి తొలగిపోతే తాము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది. జయలలిత పార్టీ అన్నాడీఎంకెకు 9 ఎంపీ సీట్లు ఉన్నాయి. అయితే మద్దతు విషయంపై జయలలిత ఇంకా పూర్తిగా చెప్పలేదని, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపలేదని కాంగ్రెస్ అంటోంది. కాగా డిఎంకె సైతం సీట్ల సర్దుబాటు విషయంలో సోమవారం వరకు వేచి చూసే ధోరణి అవలంభించనున్నట్టుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+