హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఉద్యోగుల కోసం 610 జీవో అమలుకు కమిటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kirankumar Reddy
హైదరాబాద్ : ఉద్యోగాల్లో తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జారీ అయిన 610 జీవో అమలుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆ జీవో అమలుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ నేతృత్వంలో ఐదుగురితో ఓ కమిటీని వేసింది. 610 జీవోను అన్ని శాఖల్లో అమలు చేస్తామని, దాన్ని ఉల్లంఘించినవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్వీ ప్రసాద్ చెప్పారు. తెలంగాణ స్థానికులకు ఉద్యోగాల్లో అన్యాయం జరిగిందనే విమర్శలు రావడంతో దాన్ని సవరించడానికి స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రభుత్వం ఆ జీవోను జారీ చేసింది.

జీవో ఎన్టీ రామారావు ప్రభుత్వంలో జారీ అయినప్పటికీ అది అమలు కాలేదు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత దాన్ని అమలు చేయాలనే డిమాండ్ ఊపందకుంది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అందుకు హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయలేదు. ఇప్పుడు దాని అమలుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పూనుకుంది.

English summary
CM Kirankumar Reddy Government constituted a committee to implement 610 GO. The committee wil work under the le4adership of Chief Secretary SV Prasad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X