వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్, భారత్ సెమీ ఫైనల్ మ్యాచు చూడనున్న సోనియా గాంధీ
పాక్, భారత్ సెమీ ఫైనల్ మ్యాచుకు దాదాపు 60 మంది పార్లమెంటు సభ్యులు వెళ్తారని భావిస్తున్నారు. వీరిలో నలుగురైదుగురు ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్లమెంటు సభ్యులు కూడా ఉంటారు. కేంద్ర మంత్రులు కూడా పలువురు ఈ మ్యాచుకు వెళ్లే అవకాశాలున్నాయి. పలువురు వివిఐపిలు ఈ మ్యాచుకు వస్తుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
చండీఘర్, మొహాలీ, పంచకుల సాయుధ బలగాలతో నిండిపోయాయి. వ్యూహాత్మకంగా విమాన నిరోధక గన్లను ఏర్పాటు చేశారు. మొహాలిని నో ఫ్లై జోన్గా ప్రకటించారు. భారత వైమానిక దళాల హెలికాప్టర్లను సిద్ధం చేశారు. వాటి ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుంది. ఫైటర్ జెట్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. బహుళ అంచెల భద్రతా వలయాలను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ బలగాలు ఇప్పటికే మోహరించాయి.
Comments
sonia gandhi manmohan singh world cup 2011 new delhi సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రపంచ కప్ 2011 న్యూఢిల్లీ
English summary
Congress president Sonia Gandhi to attend Mohali match to be held between pakistan and India. semi final match of Cricket World cup between pakistan and India to be held om March 30.
Story first published: Monday, March 28, 2011, 9:58 [IST]