కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి, కాంగ్రెసులకు ప్రజలు బుద్ధి చెబుతారు: జగన్ వర్గం నేతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇమేజ్‌ని ఎవరూ దెబ్బతీయలేరని జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, అమరనాథ్ రెడ్డి, ఇటీవలె స్థానిక సంస్థ నుండి గెలిచిన శాసనమండలి సభ్యుడు నారాయణరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. జగన్‌ను దెబ్బతీయాలని ప్రధాన ప్రతిపక్షంతో పాటు అధికార పక్షం చూస్తుందని ఆరోపించారు.

జగన్‌ను ఎవరూ దెబ్బతీయలేరన్నారు. జగన్‌ను లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజలు రానున్న ప్రజాకోర్టులో తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఒక్క జగన్‌ను దెబ్బతీయడానికి ప్రతిపక్ష, అధికార పక్షాలు కలిసి పోవడం విచారకరమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపులపై ప్రభుత్వం సభా సంఘం వేసి అవమాన పరిచిందన్నారు. జగన్‌ను దెబ్బతీయడానికి సభాసంఘమే కాదు ఏమి వేసుకున్న ప్రజల అండ ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరన్నారు.

English summary
MLC Narayana Reddy MLAs Adinarayana Reddy, Amarnath Reddy were fired at Congress and Telugudesam party today. They said no one will damage Ex MP YS Jagan's image.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X