మే 2వ తేదీకి ఎంసెట్ వాయిదా, ఉప ఎన్నికలే కారణం
అనంతరం జయప్రకాశ్రావు విలేకర్లతో మాట్లాడుతూ ఎంసెట్ వాయిదాను ప్రకటించారు. కడపలో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షను 6715 మంది, మెడికల్ పరీక్షను 1510 మంది విద్యార్థులు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మే 8న కడప ఉపఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాల లెక్కింపు 13న ఉంటుందని.. దీనివల్ల ఎంసెట్ను మే 15న నిర్వహించాలన్నా ప్రశ్నపత్రాల భద్రత, ఇతర ఏర్పాట్లకు అవరోధాలు కలుగుతాయన్నారు. అదీగాక మే 15న క్లాట్, నిమ్సెట్ తదితర ప్రవేశపరీక్షలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ కారణాల వల్లే పరీక్షను మే 22న జరపాలని నిర్ణయించామని, జూన్ మొదటి వారంలో మార్కులు వెల్లడించి నెలాఖరుకు ర్యాంకులు ప్రకటిస్తామన్నారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా పరీక్షను ఆదివారం రోజే నిర్వహించాలని నిర్ణయించామని, నిరుడు కూడా ఆదివారమే జరిపామని గుర్తు చేశారు.
Comments
English summary
EAMCET is postponed to May 22 from may 8 due to by polls of Kadapa loksabha and Pulivendula assembly seats.
Story first published: Friday, April 1, 2011, 8:27 [IST]