కడపలో వైయస్ జగన్తో టిడిపి నేత మైసురా రెడ్డి ఢీ

కడప జిల్లాకు చెందిన తమ పార్టీ నాయకులు కందుల రాజమోహన్ రెడ్డి, కందుల శివానంద రెడ్డి కాంగ్రెసు పార్టీలోలో చేరుతుండడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థులు కూడా దొరకటం లేదని అందుకే తమ అభ్యర్థులను ప్రలోభపెడుతున్నారని ఆయన అన్నారు. ఈ ఉప ఎన్నికలు నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటమని ఆయన అన్నారు. ప్రలోభాలకు లొంగి ఒక్కరో ఇద్దరో తమ పార్టీ నాయకులు కాంగ్రెసులోకి వెళ్తే తమకు వచ్చే నష్టమేమీ లేదని ఆయన అన్నారు. తమకు బలమైన క్యాడర్ ఉందని, రెండు స్థానాల్లోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications