కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గెలిస్తే దోచుకుంటాడు: వైయస్ జగన్‌పై డిఎల్, మైసూరా రెడ్డి నిప్పులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు, తెలుగుదేశం కడప పార్లమెంటు అభ్యర్థులు సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం మైసూరారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రజలు తనను తప్పకుండా గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎలాంటి అవినీతి జరగకుండా, ధన ప్రభావం లేకుంటే తన గెలుపు ఖాయమని మైసూరారెడ్డి అన్నారు. ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా తనను ఓటు వేసి గెలిపించాలని కోరారు. జగన్ మూడేళ్లలో వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. జగన్ అఫిడవిట్‌లో చూపించని ఆస్తులు ఇంకా చాలా ఉన్నాయని అన్నారు.

జగన్‌పై కాంగ్రెసు ఎంపీ అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి కూడా నిప్పులు కక్కారు. ఇప్పటికే రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దోచుకోవచ్చుననే ఆశతో ఉన్నారని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు తనను ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పారు. మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు ఎమ్మెల్యే జేసి దివాకర్ రెడ్డి కాంగ్రెసు పార్టీ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెసుకే ఓటర్లు మొగ్గు చూపుతారని అన్నారు.

English summary
Congress and TDP Kadapa MP candidates DL Ravindra Reddy and Mysoora Reddy fired at Ex MP YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X