ట్రస్టు సభ్యులు హామీ ఇచ్చారు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు: సిఎం

Kirankumar Reddy
అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయిసేవలు మరువలేనివని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం పుట్టపర్తిలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. బాబా మరణ వార్త విని హుటాహుటిన ఆయన పుట్టపర్తి బయలుదేరి వెళ్లారు. బాబా సేవలు మరువలేనివని అన్నారు. బాబాను అందరూ ఆదర్శంగా తీసుకొని పయనించాలని సూచించారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. సందేశంతో బాబా జీవితం గడిపారని అన్నారు. బుధవారం వరకు నాలుగు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్టు చెప్పారు. బుధవారం అనంతపురం జిల్లాకు సెలవు ప్రకటిస్తున్నట్టు చెప్పారు.

విద్య, వైద్య రంగాల్లో బాబా చేసిన కృషి అమోఘం అని అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా బాబా ప్రజల దాహార్తిని తీర్చారని కొనియాడారు. బాబా సేవలు కొనసాగిస్తామని ట్రస్టు సభ్యులు కొనసాగిస్తామని హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మానవ సేవే మాధవ సేవ అని గట్టిగా నమ్మిన వ్యక్తి బాబా అన్నారు. కాగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఉంటాయని సిఎం చెప్పారు. కాగా పుట్టపర్తికి కావాల్సినన్ని బస్సులు నడపాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+