కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఇదిగో సాక్ష్యం..., ఆయన సంపాదన న్యాయమైనదా: చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రికి కావడానికి ఎమ్మెల్యేలను తన వద్దకు పంపించడానికి టీవీ ఛానళ్లే సాక్ష్యమని ఆదివారం ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తన ప్రచారంలో చెప్పారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.

ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ అనడం ఆయన దురహంకారానికి నిదర్శనం అన్నారు. తన సంపాదన న్యాయమైనదని జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో కలపడం తమ కార్యకర్తలు, అభిమానులు అందరూ ఆహ్వానిస్తున్నారని చెప్పారు. తాను ఊహించిన దానికన్నా అనూహ్యమైన స్పందన వస్తుందని అన్నారు.

కాంగ్రెసును గెలిపించడానికి కడప, పులివెందుల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. భౌతిక దాడులతో సాధించేది ఏమీ లేదన్నారు. ఓటమి భయంతోనే జగన్ తనపై దాడి చేయించారని ఆరోపించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని అవమానిస్తే మహిళలను మొత్తం అవమానించినట్లేనని అన్నారు. జగన్ బిజెపితో కలిసి మైనార్టీలకు అన్యాయం చేయడానికి సిద్ధమయ్యాడని ఆరోపించారు.

English summary
PRP president Chiranjeevi fired at Ex MP YS Jagan today in his campaign. He questioned about his property. He said Jagan sent MLA to his residence to support him. He said TV channels are witness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X