వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్, సోనియా దొందు దొందే, పార్టీతో సంబంధాలు లేవు: కిషన్‌రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండు రెండే అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట నియోజకవర్గ శాసనసభ్యుడు జి.కిషన్ రెడ్డి ఆదివారం వరంగల్ జిల్లాలో అన్నారు. సోనియా కాంగ్రెసు, జగన్ కాంగ్రెసు బొమ్మ బొరుసు లాంటివన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచి వేయడంలో చూపే శ్రద్ధ శాంతి భద్రతల విషయంలో చూపించడం లేదని ఆరోపించారు.

వైయస్ జగన్ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీకి, బిజెపికి ఎలాంటి సంబంధాలు లేవని అన్నారు. జగన్ పార్టీకి అసలు విధి విధానాలే లేవని చెప్పారు. అలాంటి పార్టీతో మేం సంబంధాలు ఎందుకు పెట్టుకుంటామని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై కాల్పులను ఆయన ఖండించారు. భూవివాదాలను పరిష్కరించే చట్టం ప్రభుత్వం తీసుకు రావాలని డిమాండ్ చేశారు.

English summary
BJP state president Kishan Reddy condmned links with Ex MP YS Jaganmohan Reddy's YSR Congress party with BJP. He blamed Sonia and YS jagan also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X