వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో తప్పిపోయిన చిరు హెలికాప్టర్‌, క్షేమంగా కోల్‌కతాలో ల్యాండింగ్‌

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
ఖరగ్‌పూర్: ఖరగ్‌పూర్‌లో బుధవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రముఖ నటుడు, ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవి ప్రయాణించిన హెలికాప్టర్‌ సిగ్నల్స్‌ కొంతసేపు నియంత్రణ కేంద్రానికి అందకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ నేతలు, అభిమానులు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. పురూలియా నుంచి బయలుదేరిన చిరంజీవి ఛాపర్‌ 45 నిమిషాల వరకు ఖరగ్‌పూర్‌ రాకపోవడం, అటు కోల్‌కతా చేరకపోవడంతో ఆందోళన నెలకొంది. సుమారు రెండు గంటల అనంతరం ఆయన డమ్‌డమ్‌ విమానాశ్రయానికి క్షేమంగా చేరుకున్నారని తెలియడంతో కాంగ్రెస్‌ నేతలు కుదుటపడ్డారు.

అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో ఖరగ్‌పూర్‌కు రాత్రి 9.15 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. చౌరంగీ ప్రాంతం నుంచి వందలాది మంది కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి చిరంజీవికి స్వాగతం పలికారు. డెవలప్‌మెంట్‌ దోబీఘాట్‌ వద్ద ప్రచారం రథం ఎక్కి ఖరగ్‌పూర్‌ సదర్‌ అభ్యర్థి జ్ఞాన్‌సింగ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. వీరికి ప్రజలు అడుగడుగునా పూలమాలలు వేసి స్వాగతం పలికారు. తెలుగు వారు అధికంగా ఉండే కాలనీలలో చిరంజీవి పర్యటించారు.

English summary
There was a brief panic situation on Wednesday when Praja Rajyam chief, Mr K. Chiranjeevi’s helicopter, on which he was travelling from Bagmundi to Kharagpur in West Bengal to address a rally, was reported missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X