చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై క్యాంపస్‌లో ఐఐటి విద్యార్థి నితిన్ కుమార్ రెడ్డి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

IIT Student
చెన్నై: చెన్నై క్యాంపస్‌లో ఐఐటి విద్యార్థి నితిన్ కుమార్ రెడ్డి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న నితిన్ కుమార్ రెడ్డి అతని బ్యాచ్‌మేట్స్‌తో పాటు ఉత్తీర్ణత సాధించడం లేదని తెలిసిన వెంటనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే కారణంతో మూడు నెలల క్రితం అదే డిపార్ట్‌మెంట్‌లో ఓ విద్యార్థి మరణించాడు.

నితిన్ కుమార్ రెడ్డి కోర్సును మరో ఆరు నెలల పాటు పొడిగించినట్లు డిపార్ట్‌మెంట్ హెడ్ వెంకటేశన్ ఎస్పీ చెప్పారు. దీంతో డిఆర్‌డిఒ అధికారిక పనుల మీద ఉన్న తండ్రి లక్ష్మణమూర్తి రెడ్డికి ఓ లేఖ రాసి నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీ తనకు ఇచ్చిన ఉద్యోగం దీని వల్ల పోతుందనే భయంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నితిన్ ఆ లేఖలో రాశాడు. తన నిర్ణయాన్ని బెంగళూర్‌లో ఉన్న తన మిత్రురాలికి తెలియజేయాలని కూడా అతను రాశాడు.

English summary
A final year IIT-M student committed suicide in his hostel on Wednesday at 2.45pm. Nitin Kumar Reddy, a mechanical engineering student, ended his life minutes after he was told that he would not be able to pass out along with his batch mates this May.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X