'కడప ఉప ఎన్నికలలో జగన్ సాక్షి మీడియా ఉద్యోగుల ప్రచారం'

Mallu Bhatti Vikramarka
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా ఉద్యోగులు కడప, పులివెందుల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని కాంగ్రెసు చీప్ విప్ మల్లు భట్టి విక్రమార్క గురువారం ఆరోపించారు. వారు కూడా జగన్ తరఫున ప్రచారం చేస్తున్నందున వారి జీతాలను కూడా జగన్ ఎన్నికల ఖర్చులో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్షి ఛానల్లో రోజుకు 20 గంటలు ఆయనకు సంబంధించిన వార్తలే వస్తున్నాయని, దీనిపై కూడా ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కోరారు.

కాగా త్వరలో కాంగ్రెసు ప్రజా ప్రతినిధులం అందరం కలిసి గనుల రక్షణా యాత్రను చేపడతామని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ అన్నారు. గనులలో జరిగిన అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకు వస్తామని చెప్పారు. అందులోని అక్రమాలు త్వరలో బయట పెట్టేందుకు చర్యలు చేపడతామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+