చిదంబరంతో గవర్నర్ నరసింహన్ మంత్రాంగం, తెలంగాణపైనే భేటీ

Narasimhan-Chidambaram
న్యూఢిల్లీ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గురువారం కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంతో సమావేశమయ్యారు. చిదంబరంతో ఆయన ఏం మాట్లాడారనేది తెలియడం లేదు. భేటీలో చర్చకు అంశాలపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. హోం శాఖ కార్యదర్శి, సిబిఐ డైరెక్టర్, ఇంటలిజెన్స్ ఐజిలతో కూడా ఆయన సమావేశమయ్యారు. తెలంగాణపై కేంద్ర ప్రకటనకు తెలంగాణవాదులు విధించిన గడువు సమీపిస్తుండడంతో ఈ భేటీ జరిగినట్లు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగిసే దాకా వేచి చూస్తామంటూ కాంగ్రెసు తెలంగాణ నాయకులు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలంగాణ రాజకీయ జెఎసి నేరుగా ప్రకటించకపోయినప్పటికీ అంత దాకా వేచి చూసే ధోరణినినే అవలంబిస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమం తిరిగి ఊపందుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో గవర్నర్ నరసింహన్‌ చిదంబరంతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలని గవర్నర్ మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సవ్యంగానే ఉన్నాయని చెప్పారు. విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకాలను త్వరలో చేపడతామని ఆయన చెప్పారు. నరసింహన్ చిదంబరంతో కడప ఉప ఎన్నికల తర్వాత తలెత్తే పరిణామాలపై కూడా చర్చించినట్లు చెబుతున్నారు. చిదంబరానికి గవర్నర్ ఏదైనా నివేదిక సమర్పించారా, లేదా అనేది తెలియడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+