ఉప ఎన్నికలలో గెలుపు కోసం జగన్ వ్యూహ రచన: నేతలతో భేటీ
ఎన్నికల సంఘం తమకు కేటాయించిన ఫ్యాన్ గుర్తును వోటర్లలోకి ఎంత వరకు తీసుకు వెళ్లామనే విషయంపై ప్రధానంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. గత ముప్పయ్యేళ్లుగా చేతి గుర్తుకు అలవాటు పడి పోయిన వోటర్లను ఫ్యాన్ గుర్తుకు మరల్చేలా తగిన విధంగా ప్రచారాన్ని నిర్వహించామా లేదా అనే దానిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రచారానికి మరో రోజు మాత్రమే మిగిలి ఉన్నందున ఎక్కడైనా ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దుకొని వోటర్లకు చెప్పే దిశలో చర్యలు తీసుకునే విధంగా ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.
ఇంచార్జులు ఎలా పని చేస్తున్నారు. ఏఏ ప్రాంతాలలో ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది. సానుభూతి కారణంగా టిడిపి సాంప్రదాయక ఓట్లు తమకు ఎంత వరకు పడే అవకాశం ఉందని స్థానిక ఇంచార్జుల నుండి సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓటింగ్ శాతం పెంచే దిశలో కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో కంటే ఓటింగ్ పెంచాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంఛార్జులు ఓటింగ్కు దూరంగా ఉండే వారిపై దృష్టి సారించి వారిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసేలా చర్యలు తీసుకునేలా చేపట్టాలని సూచించినట్లుగా తెలుస్తోంది.