వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవే ప్రధానం: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: తనకు పదవులపై ఆలోచన లేదని, ప్రజాసేవ చేస్తూ జనంలో ఉండటమే ఇష్టమని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. సీడబ్ల్యూసీ పదవి కట్టబెడతారనే వార్తల నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో అడుగుపెట్టిన చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రాత్రి పార్టీ నాయకులు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావులతో కలిసి ఆయన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ను కలుసుకున్నారు. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో భేటీ కానున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత చిరంజీవి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

అయిదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత విలీనం గురించి మాట్లాడుకుందామని కాంగ్రెస్‌ పెద్దలు చెప్పిన నేపథ్యంలోనే తాను వచ్చాను తప్ప ఇతర కారణాలేమీ లేవన్నారు. విలీనం తేదీ, వేదికలు ఒకటి రెండురోజుల్లో ఖరారవుతాయని తెలిపారు. కేంద్ర పదవుల్లోకి వస్తారా? అన్న ప్రశ్నకు తనను ఎక్కడికి తీసుకోవాలన్నది వారే నిర్ణయిస్తారని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం బెదిరింపు కాదన్నారు. అది చట్టబద్ధంగా పార్టీలకున్న హక్కు అని పేర్కొన్నారు. కడప ఉప ఎన్నికల ఫలితాలపై ముందుగానే వ్యాఖ్యానించడం సబబు కాదని తెలిపారు.

English summary
Prajarajyam party president Chiranjeevi said that he is not interested on posts. He said that public service is important to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X