వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోయిడా గ్రామంలోకి దూసుకొచ్చిన రాహుల్, యుపి పోలీసులకు టోకరా

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులకు టోకరా ఇచ్చి కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ భూవివాదం చెలరేగుతున్న నోయిడా గ్రామాల్లో బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. ఆయన గ్రేటర్ నోయిడాలోని భట్ట పర్సోల్ గ్రామాన్ని సందర్శించారు. ఆందోళనకు దిగిన రైతులను పలకరించారు. మాయావతి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములకు నష్టపరిహారం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

యుమునా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణఆనికి స్వాధీనం చేసుకున్న తమ భూములకు నష్టపరిహారం పెంచాలని రైతులు ఆందోళన చేపట్టారు. తన కావల్కేడ్‌ను రెండు కిలోమీటర్ల దూరంలో ఆపేసి సాధారణ వ్యక్తిలా రాహుల్ గాంధీ బైక్‌పై గ్రామంలోకి ప్రవేశించారు. గ్రామంలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ ఆందోళన చేస్తున్న రైతుల ఇంటింటికీ వెళ్లారు. వారి సమస్యను విన్నారు. రైతులకు న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

రాహుల్ గాంధీ పర్యటన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిని సవాల్ చేయడమేనని అంటున్నారు. గ్రామంలోకి ఎవరూ ప్రవేశించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. గ్రామాల్లోకి రాజకీయ నాయకుల ప్రవేశాన్ని నిషేధించింది. రైతుల ఆందోళనలో ఇద్దరు పోలీసులతో పాటు నలుగురు వ్యక్తులు మరణించారు.

English summary
Congress general secretary Rahul Gandhi on Wednesday continued with his ways of carrying out ‘surprise visits’ to parts of Uttar Pradesh as he reached the Bhatta Parsol village in the Greater Noida, deceiving the state police to meet the agitating farmers demanding adequate compensation for their land acquired by the Mayawati government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X