వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నోయిడా గ్రామంలోకి దూసుకొచ్చిన రాహుల్, యుపి పోలీసులకు టోకరా
యుమునా ఎక్స్ప్రెస్ వే నిర్మాణఆనికి స్వాధీనం చేసుకున్న తమ భూములకు నష్టపరిహారం పెంచాలని రైతులు ఆందోళన చేపట్టారు. తన కావల్కేడ్ను రెండు కిలోమీటర్ల దూరంలో ఆపేసి సాధారణ వ్యక్తిలా రాహుల్ గాంధీ బైక్పై గ్రామంలోకి ప్రవేశించారు. గ్రామంలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ ఆందోళన చేస్తున్న రైతుల ఇంటింటికీ వెళ్లారు. వారి సమస్యను విన్నారు. రైతులకు న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
రాహుల్ గాంధీ పర్యటన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిని సవాల్ చేయడమేనని అంటున్నారు. గ్రామంలోకి ఎవరూ ప్రవేశించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. గ్రామాల్లోకి రాజకీయ నాయకుల ప్రవేశాన్ని నిషేధించింది. రైతుల ఆందోళనలో ఇద్దరు పోలీసులతో పాటు నలుగురు వ్యక్తులు మరణించారు.
Comments
English summary
Congress general secretary Rahul Gandhi on Wednesday continued with his ways of carrying out ‘surprise visits’ to parts of Uttar Pradesh as he reached the Bhatta Parsol village in the Greater Noida, deceiving the state police to meet the agitating farmers demanding adequate compensation for their land acquired by the Mayawati government.
Story first published: Wednesday, May 11, 2011, 12:21 [IST]