టిడిపి నేత మథిర బ్రహ్మా రెడ్డి ఆత్మహత్య, విజయవాడలో ఘటన

Telugudesam
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నాయకుడు, నల్లగొండ జిల్లా కోదాడ మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మథిర బ్రహ్మా రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన స్వస్థలం కోదాడ. ఈ నెల 25వ తేదీన ఆయన హోటల్ ఐలాపురంలో దిగారు. రెండు రోజుల పాటు గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ సిబ్బంది పోలీసులకు తెలియజేశారు.

తాను కరీంనగర్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ రణభేరీకి వెళ్తున్నట్లు చెప్పి 25వ తేదీన ఇంటి నుంచి బయలుదేరారు. ఆయన అదే రోజు విజయవాడ హోటల్ ఐలాపురంలో గది తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆయన రణభేరికి వెళ్లారా, లేదా అనేది తెలియడం లేదు. పురుగుల మందు తాగి బ్రహ్మా రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆర్థిక లావాదేవీలో ఆయన ఆత్మహత్యకు కారణమని చెబుతున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాదులోని జూబిలీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఆయన అదృశ్యమైనట్లు కేసు నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+