అశ్లీల మెయిల్స్ పంపిన టెక్కీ అరెస్టు, నిశ్చితార్థం చెడగొట్టిన వైనం
కూకట్పల్లిలోని కొంత మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంప్యూటర్ల నుంచి మెయిల్స్ వెళ్తున్నట్లు గ్రహించిన పోలీసులు హరిప్రసాద్ను అరెస్టు చేశారు. తాను, బాధితురాలు కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఒకే పాఠశాలలో చదివామని హరిప్రసాద్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. పాఠశాల విద్య ముగిసిన తర్వాత బిటెక్ చదివే రోజుల వరకు తాము కలుసుకోలేదని, ఆ తర్వాత ఆమె మొబైల్ నెంబర్ సాధించగలిగానని అతను చెప్పాడు. ఆ తర్వాత ఆమెతో తరుచూ మాట్లాడసాగాడు. అతని ప్రేమను ఆమె నిరాకరించడంతో ఇరువురి మధ్య సంబంధాలు తెగిపోయాయి.
ఈ ఏడాది ఆరంభంలో అమెరికాలోని ఎన్నారైతో ఆమె పెళ్లికి నిశ్చితార్థం జరిగింది. విషయం తెలుసుకున్న హరిప్రసాద్ జగ్గయ్యపేటలోని కొంత మంది ద్వారా పెళ్లి కుమారుడి వివరాలు తెలుసుకున్నాడు. ఇంటర్నెట్లో శోధించి అతని మెయిల్ ఐడి సంపాదించాడు. అప్పటి నుంచి పెళ్లి కూతురిపై అతనికి అసభ్యకరంగా, అశ్లీలంగా మెయిల్స్ పంపుతూ వచ్చాడు. ఆ మెయిల్స్ను ఆమెకు కూడా పంపుతూ వచ్చాడు. దీంతో నిశ్చితార్థం రద్దయింది.