వైయస్ జగన్ బలం మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువే: బాలినేని శ్రీనివాస రెడ్డి

Balineni Srinivas Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట ఉన్న శాసనసభ్యుల బలం మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువేనని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. జగన్ వెంట ఉన్న ఎమ్మెల్యే సంఖ్య మ్యాజిక్ ఫిగర్ కన్నా ఒక్కటి ఎక్కువే ఉంటుందని ఆయన అన్నారు. వైయస్ జగన్‌ను కలవడానికి వచ్చిన ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తమ తడాఖా చూపిస్తామని ఆయన అన్నారు.

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుదేనని, ఆ బాధ్యతను తమపై మోపడాన్ని చూస్తుంటే కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయ్యాడని చెప్పక తప్పదని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు పెట్టాలని, అవిశ్వాసం పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో చంద్రబాబు చూడాలని ఆయన అన్నారు. అవిశ్వాసం పెట్టాలంటే చంద్రబాబు రాజకీయంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

చంద్రబాబు నాయుడు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రమంతటా కడప ఉప ఎన్నికల ఫలితాలే వస్తాయని ఆయన అన్నారు. పరిస్థితిని దిగజార్చుకోవడం చంద్రబాబుకు మంచిది కాదని ఆయన అన్నారు. అవిశ్వాసం పెడితే ఆ సీట్లు కూడా మిగులుతాయో లేదోనని భయమని, చంద్రబాబు పరిస్థితి అన్యాయంగా ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు అమాయకుడేమీ కాడని, చంద్రబాబు పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆయన అన్నారు. మంగళవారంనాడు వైయస్ జగన్‌ను 9 మంది శాసనసభ్యులు కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+