టిడిపిని టార్గెట్ చేసిన కోదండరామ్, మోసం చేస్తోందని ఆరోపణ

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన అన్నారు. మంత్రి పదవికి జూపల్లి కృష్ణారావు రాజీనామా చేయడం శుభపరిణామమని ఆయన అన్నారు. మిగతా తెలంగాణ మంత్రులు కూడా రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు కాలయాపన చేయవద్దని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన అన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు జెఎసి కమిటీలు ప్రచారంలో పాల్గొంటాయని ఆయన చెప్పారు. తెలుగుదేశం నుంచి సస్పెండైన నాగం జనార్దన్ రెడ్డి ఆదిలాబాద్లో నిర్వహించే తెలంగాణ సభకు వెళ్లే విషయంపై జెఎసి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications