అవిశ్వాసంపై చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్లనున్న టిఆర్ఎస్, సిపిఐ

టిడిపి అవిశ్వాస తీర్మానాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్వాగతించారు. సోంపేట, కాకరాపల్లి ఘటనలను ప్రధానంగా తీసుకుంటామని చెప్పారు. అవిశ్వాసం ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లుగా ఉందన్నారు. అవిశ్వాసంతో ఎవరు ఎటున్నారో తేలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెసు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాల్సిందే అన్నారు. దానికి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications