బొత్స ర్యాలీలో వైయస్ అనుచరుడు సూరీడు: కాంగ్రెసులో జోరుగా చర్చ!
బొత్స భారీ ర్యాలీతో గాంధీ భవన్ వచ్చాడు. అయితే బొత్స ఉన్న వాహనంలోనే సూరీడు ర్యాలీలో పాల్గొన్నాడు. బొత్స వెనుకే నిల్చున్నాడు. ఆ తర్వాత గాంధీభవన్ వచ్చిన తర్వాత బొత్స వేదిక పైకి వెళుతున్న సమయంలో కూడా వేదిక పైకి వెళుతూ కనిపించాడు. అయితే చాలాకాలం తర్వాత సూరీడు కనిపించడంతో కాంగ్రెసు వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. గతంలో వైయస్కు తోడుగా నీడగా ఉన్న సూరీడు ఇప్పుడు బొత్సకు కూడా కుడిభుజంలా ఉంటాడేమోననే గుసగుసలు వినిపిస్తున్నాయి.
botsa satyanarayana sureedu ys rajasekhar reddy congress hyderabad బొత్స సత్యనారాయణ సూరీడు వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు హైదరాబాద్
English summary
Sureedu was appeared in PCC president Botsa Satyanarayana rally today. Sureedu disappeared after YS died.
Story first published: Saturday, June 11, 2011, 14:35 [IST]