విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీఏ ఏజెంట్ మృతి, ఎంపీ లగడపాటి అనుచరులపై అనుమానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విజయవాడ: పార్లమెంటు సభ్యుడు లగడపాటి అనుచరులుగా భావింపపడుతున్న నలుగురు ఆర్టీఏ ఏజెంట్‌ను తమ కారుతో గుద్దడం వల్ల చికిత్స పొందుతూ మరణించారు. ఈ సంఘటన సోమవారం విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడలో రద్దీగా ఉండే ఎల్ఐసి కార్యాలయం ప్రాంతం నుండి రంగనాథ్ అనే ఆర్టీఏ ఏజెంట్ ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఎదురుగా కారు ఆయన స్కూటర్‌ను గుద్దుకుంది. కారులో నలుగురు ఉన్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన వారు కారు దిగి వచ్చి రంగనాథ్‌తో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది. వారు తాము ఎంపీ లగడపాటి అనుచరులమని చెప్పి రంగనాథ్‌ను బెదిరించే ప్రయత్నం చేశారు. అనంతరం వారు ఆయనపై దాడి చేశారు. రంగనాథ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు.

స్థానికులు రంగనాథ్‌ను దగ్గరలోని హెల్త్ హాస్పిటల్ తరలించారు. రంగనాథ్‌ను పరిశీలించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు చెప్పారు. అయితే కారులో వచ్చిన నలుగురు లగడపాటి అనుచరులుగా రంగనాథ్ బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో నగరంలోని ఓ కార్పోరేటర్ తమ్ముడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్దేశ్య పూర్వకంగానే తమ తండ్రి స్కూటర్‌ను కారుతో గుద్ది గొడవకు దిగి హత్య చేశారని రంగనాథ్ బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా లగడపాటి అనుచరులని మొదట చెప్పిన బంధువులు ఆ తర్వాత బెదిరింపులు రావడంతో నోరు విప్పడానికి భయపడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

కాగా దాడికి పాల్పడ్డ వారి ఎవరో పోలీసులు బయట పెట్టడం లేదు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నామని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా రంగనాథ్ బంధువులను పరామర్శించడానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు వచ్చారు. కాగా దాడి తమ అనుచరుల పని కాదని ఎంపీ లగడపాటి చెప్పారు. ఆ దాడిని ఆయన ఖండించారు.

English summary
RTA agent Ranganath died in Vijayawada by unknown persons attack today. Ranganath relatives suspecting that MP Lagadapati Rajagopal followers attacked Ranganath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X