తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా

Damodara Raja Narasimha
న్యూఢిల్లీ: తెలంగాణపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తెలంగాణ ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామని పార్టీ తెలంగాణ ప్రజాప్రతినిధులు అంటున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తేగా సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. తెలంగాణ అంశంపై పార్టీ అధిష్టానానికి అవగాహన ఉందని, త్వరలో పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణకు చట్టబద్దమైన ప్రాంతీయ మండలి ఏర్పాటు ప్రతిపాదనపై పార్టీ అధిష్టానం పెద్దలతో జరిగిన సమావేశాల్లో చర్చకు రాలేదని ఆయన చెప్పారు.

తెలంగాణ అంశంపై అధిష్టానం పెద్దలతో చర్చలు జరిగాయని ఆయన చెప్పారు. విద్య, ఉద్యోగావకాశాలే ముఖ్యమని ఆయన చెప్పారు. తెలంగాణ ఇవ్వకపోయినా కట్టుబడి ఉంటారా అని అడిగితే ఎక్కడైనా వెనకబడిన ప్రాంతాల్లో విద్య, ఉద్యోవకాశాలు మెరుగుపడాలని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం అందరి అభిప్రాయాలు తెలుసుకుని సమస్యను పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు. తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి, తెలంగాణ అంశానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తనకు పాలనా దక్షత ఉంది కాబట్టే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+