హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆజాద్ చర్చలు, మెట్టు దిగని తెలంగాణ నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
హైదరాబాద్‌: తెలంగాణ నాయకులతో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చర్చలు విఫలమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే తమ డిమాండ్ నుంచి తెలంగాణ నాయకులు వెనక్కి తగ్గలేదు. ఆజాద్ మంగళవారం ఉదయం రాష్ట్ర మంత్రులు కె. జానారెడ్డి, సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్‌లతో చర్చలు జరిపారు. అయితే, తెలంగాణపై మెట్టు దిగడానికి తెలంగాణ నాయకులు నిరాకరించారు. తెలంగాణ ప్రజల మనోగతాన్ని, తమ అభిప్రాయాన్ని అధిష్టానానికి వివరిస్తానని ఆజాద్ తమకు చెప్పినట్లు జానా రెడ్డి సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

తెలంగాణ ఇవ్వండి, లేదంటే తమ రాజీనామాలను ఆమోదించాలని తాము ఆజాద్‌కు చెప్పినట్లు పొన్నం ప్రభాకర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. చర్చలు జరపాలనుకుంటే జరపండి, కానీ వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించాలని కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి విస్తృతస్థాయి సంప్రదింపులు, ఏకాభిప్రాయం కావాలని ఆజాద్ చెప్పినట్లు మధుయాష్కి చెప్పారు. చర్చలు జరపాలనుకుంటే వెంటనే ప్రారంభించాలని తాము కోరినట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ ప్రాంతంలో ఏకాభిప్రాయం ఉన్నప్పుడు, ఇతర ప్రాంతాల అభిప్రాయం అవసరం లేదని, అయితే, విభజన వల్ల వచ్చే ఇబ్బందుల గురించి సీమాంధ్ర ప్రతినిధులు చెప్పుకోవచ్చునని, ఆ సమస్యలను అధిగమించడానికి తాము సహకరిస్తామని పొన్నం ప్రభాకర్ అన్నారు. తమ పార్టీ అధిష్టానం తెలంగాణ ఇస్తుందనే నమ్మకం తమకు ఉందని కాంగ్రెసు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు.

English summary
Congress AP affairs incharge Ghulam Nabi Azad talks failed with his party ministers and MPs from Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X