వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో బస్సుయాత్ర చేస్తాం: సమైక్యాంధ్ర జెఏసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

United Andhra
విశాఖపట్నం: తెలంగాణలో బస్సుయాత్ర చేపడతామని సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి నేతలు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ సాధన కోసం టిటిడిపి బస్సుయాత్ర చేపట్టిన దారిలోనే సమైక్యాంధ్ర జెఏసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యథాతథంగా ఉంచాలనే డిమాండుతో బస్సుయాత్ర సోమవారం ప్రారంభించనుంది. ఈ బస్సు యాత్ర విశాఖపట్నం, ఉత్తరాంధ్ర, సీమాంధ్రల మీదుగా ఉంటుందని చెప్పారు. అవసరమైన పక్షంలో తెలంగాణ ప్రాంతంలోనూ బస్సుయాత్ర చేపడతామని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని కొన్ని స్వార్థపూరిత వ్యక్తులు తమ రాజకీయ స్వలాభం కోసం మాత్రమే తీసుకు వచ్చారని అన్నారు.

తెలంగాణ ప్రాంతంలోని సమైక్యవాదులను దాడులు చేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్రకోసం ప్రజాప్రతినిధుల ఇళ్లముంట్టడి చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం చేస్తున్న వారు ప్రజా జీవనానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని మేము అలా చేయమని చెప్పారు. సంక్షోభం సృష్టించి ఏదో సాదిద్దామని తెలంగాణ ప్రజాప్రతినిధులు అనుకోవడం సరికాదన్నారు. చర్చలు, శాంతియుతంగానే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందన్నారు. రాజకీయాలకతీతంగా తమ బస్సుయాత్ర ఉంటుందన్నారు. కాగా వైజాగ్‌లో ప్రారంభమవుతున్న బస్సుయాత్రలో ఓ వైపు బూర్గుల రామకృష్ణారావు, మరోవైపు పొట్టి శ్రీరాములు ఫోటో పెట్టారు.

English summary
Samaikyandra JAC will be start bus yatra for Andhra Pradesh. They said they will ready to Bus Yatra in Telangana also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X