వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణలో బస్సుయాత్ర చేస్తాం: సమైక్యాంధ్ర జెఏసి
తెలంగాణ ప్రాంతంలోని సమైక్యవాదులను దాడులు చేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్రకోసం ప్రజాప్రతినిధుల ఇళ్లముంట్టడి చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం చేస్తున్న వారు ప్రజా జీవనానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని మేము అలా చేయమని చెప్పారు. సంక్షోభం సృష్టించి ఏదో సాదిద్దామని తెలంగాణ ప్రజాప్రతినిధులు అనుకోవడం సరికాదన్నారు. చర్చలు, శాంతియుతంగానే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందన్నారు. రాజకీయాలకతీతంగా తమ బస్సుయాత్ర ఉంటుందన్నారు. కాగా వైజాగ్లో ప్రారంభమవుతున్న బస్సుయాత్రలో ఓ వైపు బూర్గుల రామకృష్ణారావు, మరోవైపు పొట్టి శ్రీరాములు ఫోటో పెట్టారు.
Comments
English summary
Samaikyandra JAC will be start bus yatra for Andhra Pradesh. They said they will ready to Bus Yatra in Telangana also.
Story first published: Monday, July 11, 2011, 11:09 [IST]