భవిష్యత్తులో దాడులని నిరోధించడానికి అన్నీ చేస్తాం: పిఎం

ఉగ్రవాదుల కిరాతక చర్యలను ఖండించడానికి తన వద్ద పదాలు లేవని ఆయన అన్నారు. యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో కలిసి వచ్చిన ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముంబై ప్రజలకు సంఘీభావం ప్రకటించడానికి తాను ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. దాడులకు పాల్పడినవారికి శిక్ష పడేలా చూడడంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సమన్వయంతో పనిచేస్తారని ఆయన చెప్పారు. తమ కృషిలో ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రజలను విభజించి, జీవన విధానాన్ని దెబ్బ తీయడానికి ఐక్యత, శక్తి పనిచేస్తాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications