జగన్ ఆస్తులపై దర్యాప్తు: సిబిఐ నోటీసులు

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల వ్యవహారంపై సిబిఐ శనివారం వివిధ సంస్థలకు, వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. సోమవారంలోగా తమ నోటీసులకు సమాధానం ఇవ్వాలని, తమకు సమాచారం అందించాలని సిబిఐ ఆదేశించింది. మొత్తం 45 మందికి ఈ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ఆస్తుల వ్యవహారంపై ప్రాథమిక దర్యాప్తు కోసం డిఐజి లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది.

వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియాను నడుపుతున్న జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, భారతి సిమెంట్స్ సంస్థలతో పాటు వీటిలో పెట్టుబడులు పెట్టిన సంస్థలకు, వ్యక్తులకు నోటీసులు జారీ అయినట్లు సమాచారం. జగతి పబ్లికేషన్స్‌లో 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. జగన్‌కు చెందిన 17 సంస్థలపై సిబిఐ
దృష్టి సారించినట్లు సమాచారం. ఈ సంస్థలు ఆదాయం పన్ను ఎంత చెల్లించాయని, పన్ను చెల్లింపునకు సంపాదనకు మధ్య పొంతన ఉందా అనే విషయాలను సిబిఐ విచారించనుంది.

వైయస్ జగన్ పెట్టుబడుల వ్యవహారంపై దర్యాప్తు జరిపి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు సిబిఐని ఆదేశించిన విషయం తెలిసిందే. సమయం తక్కువగా ఉండడంతో సిబిఐ బృందం శని, ఆదివారాలు కూడా పనిచేస్తోంది. సంస్థలు అందించిన సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత అవసరమైతే ఆయా సంస్థలకు చెందినవారి వ్యక్తిగతంగా కూడా సిబిఐ విచారించే అవకాశాలున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+