జగన్పై సిబిఐ విచారణ జరగాల్సిందే: విహెచ్

సుప్రీంకోర్టు నిర్ణయం అవినీతిపై అంకుశమని తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ అన్నారు. అవినీతిపరులకు హెచ్చరికలాంటిదని ఆయన అన్నారు. జగన్ జైలు ఊచలు లెక్కిస్తారని ఆయన అన్నారు. అక్రమాలకు పాల్పడనప్పుడు సిబిఐ విచారణకు జగన్ ఎందుకు భయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. వైయస్ జగన్ జైలులో కొవ్వొత్తులు తయారు చేసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. జగన్ పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తెలుగుదేశం నాయకుడు ఎర్రంనాయుడు స్వాగతించారు. జగన్ అవినీతికి పాల్పడ్డారని తాము మొదటి నుంచీ చెబుతున్నామని ఆయన అన్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని బట్టే జగన్ తప్పు చేశాడని అర్థమవుతోందని ఆయన అన్నారు.
వైయస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన జగన్ డబ్బు ఉందని సోనియా గాంధీని, రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ అన్నారు. జగన్ అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించారని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడే జగన్ దోషి అని తేలిపోయిందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications