సీమాంధ్ర ఉద్యోగులకు తెలంగాణ విద్యార్థి జెఎసి హెచ్చరిక

ఆగస్టు 5 నుంచి 11 వరకు గో టూ కాలేజీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఈ తేదీల్లో సమ్మెపై విద్యార్థులను చైతన్యపరుస్తామని వారు చెప్పారు ఈ నెల 12వ తేదీ హైదరాబాదులో బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా సైకిల్ ర్యాలీ కూడా నిర్వహిస్తామని వారు తెలిపారు. 13న ఎస్సై పరీక్షలను, 14న జూనియర్ లెక్చరర్స్ పరీక్షను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఆగస్టు 16వ తేదీన కలెక్టర్ కార్యాలయాల ముట్టడి చేపడతామని వారు చెప్పారు. 17వ తేదీ నుంచి సమ్మెకు మద్దతుగా విద్యాసంస్థలను బహిష్కరిస్తామని వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్లీ రాజీనామాలు చేయాలని కాంగ్రెసు, తెలుగుదేశం శాసనసభ్యులపై ఒత్తిడి చేయాలని కూడా తెలంగాణ విద్యార్థి సంఘాలు నిర్ణయించుకున్నాయి.












Click it and Unblock the Notifications