వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ భవిష్యత్తు వ్యూహం: ఎమ్మెల్యేలతో భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
హైదరాబాద్: విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, అక్రమ నిధుల చలామణి నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) తనపై కేసు నమోదు చేయడంతో వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణ రచించేందుకు తన వర్గం శాసనసభ్యులతో బుధవారం హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. సిబిఐ దర్యాఫ్తు అనంతరం తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను సైతం ఈడి పరిశీలించడంపై, ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో పలువురికి ఈడి నోటీసులు ఇస్తుందన్న వాదనల నేపథ్యంలో జగన్ తన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

ఈడి నోటీసులు జారీ చేసినా, తాను ప్రజా క్షేత్రంలో ఉండని పరిస్థితులు ఎదురైనా ఏం చేయాలనే విషయంపై ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశనం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 26 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసి సిబిఐ కేసు దృష్టిని మరల్చడంలో ఎమ్మెల్యేలు విజయవంతమయ్యారని జగన్ వర్గం భావిస్తున్నట్లుగా సమాచారం. కాగా ఎమ్మార్ కేసులో పలువురికి సిబిఐ నోటీసులు పంపినట్లుగా సమాచారం.

కాగా అంతకుముందు కృష్ణా జిల్లాలో మొదటి విడుత ఓదార్పు యాత్ర ముగించుకొని జగన్ నేరుగా హైదరాబాద్ వచ్చారు. సెప్టెంబర్ 2న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

English summary
YSRC party president YS Jaganmohan Reddy talk with his mlas today in party office after ED case and CBI probe to chalked out a future stategy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X