ఏపీలో రోడ్ డాక్టర్.. కేవలం 15నిముషాల్లోనే రోడ్స్ మరమ్మత్తులు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అధ్వాన్నంగా మారిన రహదారుల మరమ్మతులపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వర్షాల కారణంగా రోడ్లపై ఏర్పడిన గుంతలను త్వరితగతిన పూడ్చి, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు సరికొత్త సాంకేతికతను రంగంలోకి దించింది. ఇందులో భాగంగా రహదారుల పునర్నిర్మాణానికి అత్యంత ఆధునికమైన, విప్లవాత్మకమైన 'రోడ్ డాక్టర్' వాహనాలను రంగంలోకి దించుతుంది.

రోడ్ డాక్టర్ వాహనాల ప్రత్యేకత

సాధారణంగా రోడ్లపై గుంతలు పూడ్చడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ, ఈ 'రోడ్ డాక్టర్' మెషీన్ల ద్వారా కేవలం కొద్ది నిమిషాల్లోనే అత్యంత నాణ్యతతో గుంతలను శాశ్వతంగా పూడ్చేయవచ్చు. ఈ ప్రత్యేక వాహనంలోనే రోడ్డు మరమ్మతులకు అవసరమైన తారు, కంకర మిశ్రమాన్ని సిద్ధం చేసే అత్యాధునిక సాంకేతికత ఉంటుంది.మొదటగా రోడ్డుపై ఉన్న గుంతలోని దుమ్ము, ధూళి, నీటిని ఈ వాహనానికి ఉన్న హై-ప్రెజర్ ఎయిర్ బ్లోయర్ ద్వారా పూర్తిగా క్లీన్ చేస్తారు.

AP Govt deploys Road Doctor vehicles to swiftly repair and fill potholes across state highways

కేవలం 10 నుండి 15 నిమిషాల్లోనే రోడ్ల మరమ్మత్తు

ఆ తర్వాత కంప్యూటరైజ్డ్ ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా గుంత పరిమాణానికి సరిపడా వేడి వేడి తారు మిశ్రమాన్ని నేరుగా గుంతలో ప్రెజర్ ద్వారా నింపుతారు. చివరగా ఆ మిశ్రమాన్ని రోడ్డుతో సమానంగా రోలర్ సహాయంతో గట్టిగా నొక్కుతారు. ఈ మొత్తం ప్రక్రియ కేవలం 10 నుండి 15 నిమిషాల్లోనే పూర్తవుతుంది. దీనివల్ల ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగదు.

గుంతలు లేని ఏపీగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ప్లాన్

రాష్ట్రంలో రహదారులను గుంతలు లేని ఏపీగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్అండ్‌బీ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రహదారుల నిర్వహణను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఇప్పటికే వందల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. అత్యవసర మరమ్మతులు అవసరమున్న జాతీయ, రాష్ట్ర రహదారులపై ఈ 'రోడ్ డాక్టర్' వాహనాలతో పనులను పరుగులు పెట్టిస్తున్నారు.

క్షిపణి, ఆత్మహుతి డ్రోన్ల తయారీ కేంద్రం.. ఆ జిల్లాలో ఏకంగా వెయ్యి కోట్ల పెట్టుబడి
క్షిపణి, ఆత్మహుతి డ్రోన్ల తయారీ కేంద్రం.. ఆ జిల్లాలో ఏకంగా వెయ్యి కోట్ల పెట్టుబడి

ఆధునిక సాంకేతికతతో ప్రమాదాలను తగ్గించేలా గుంతలు లేని రోడ్లు

ఈ అధునాతన యంత్రాల వాడకం వల్ల రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు చాలా కాలం పాటు మన్నికగా ఉంటాయని, తారు వృథా కాకుండా నాణ్యమైన పనులు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ సాంకేతికతతో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+