తెలంగాణపై రోశయ్య హయాంలో కుట్ర: వివేక్

Vivek
కరీంనగర్: తమిళనాడు గవర్నర్‌గా నియమితుడైన కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణపై కుట్ర జరిగిందని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు వివేక్ బుధవారం ఆరోపించారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ఎన్ని పదవులు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ తెలంగాణను మాత్రం అడ్డుకోవద్దని కోరారు. సెప్టెంబర్ నెలాఖరులోపు తెలంగాణపై కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ విషయంలో రోశయ్య ద్వంద్వ వైఖరి అవలంబించారని ఆయన విమర్శించారు. పార్టీ అధిష్టానం తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేయించాలని రోశయ్యకు చెప్పినప్పటికీ ఆయన అధిష్టానం ఆదేశాలు అమలు చేయలేదన్నారు. రామగుండం ఎఫ్‌సిఐ పునరుద్ధరణకు కరీంనగర్ జిల్లాకే ఒక వరం అన్నారు. కాగా రోశయ్యపై ఇటీవల తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు విరుచుకు పడుతున్నారు. సకల జనుల సమ్మెకు తమ మద్దతు ఉంటుందన్నారు. రెండు రోజుల క్రితమే మాజీ మంత్రి జీవన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు రోశయ్యపై విరుచుకుపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+