తెలంగాణపై రోశయ్య హయాంలో కుట్ర: వివేక్
తెలంగాణ విషయంలో రోశయ్య ద్వంద్వ వైఖరి అవలంబించారని ఆయన విమర్శించారు. పార్టీ అధిష్టానం తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేయించాలని రోశయ్యకు చెప్పినప్పటికీ ఆయన అధిష్టానం ఆదేశాలు అమలు చేయలేదన్నారు. రామగుండం ఎఫ్సిఐ పునరుద్ధరణకు కరీంనగర్ జిల్లాకే ఒక వరం అన్నారు. కాగా రోశయ్యపై ఇటీవల తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు విరుచుకు పడుతున్నారు. సకల జనుల సమ్మెకు తమ మద్దతు ఉంటుందన్నారు. రెండు రోజుల క్రితమే మాజీ మంత్రి జీవన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు రోశయ్యపై విరుచుకుపడ్డారు.
Comments
English summary
Karimnagar MP Vivek blamed former chief minister Konijeti Rosaiah for Telangana issue.
Story first published: Wednesday, August 31, 2011, 12:37 [IST]