మీసాలు లేకుండా కొత్త గెటప్లో కనుమూరి

జీవితంలో ఆయన మీసాలు తీయడం ఇది రెండోసారి. గతంలో రాజశేఖర్రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీసం తీశారట. శుక్రవారం రాత్రి పదవీ ప్రమాణం చేశాక ఆలయం నుంచి వెలుపలికి వస్తుండగా ఆయన మీసాలు చూసి గుర్తుపట్టిన చాలామంది భక్తులు అభినందించారు. కానీ, శనివారం వేకువజామున తలనీలాలు సమర్పించుకుని, మీసాలను తీసేసి స్నానం చేసి గదిలోకి వచ్చిన ఆయన్ను కుటుంబ సభ్యులే గుర్తించలేకపోయారట. మధ్యాహ్నం పాలకమండలి సమావేశం అనంతరం ప్రెస్మీట్లో ఆయన్ను గుర్తుపట్టలేకపోతున్నామని మీడియా ప్రతినిధులు పేర్కొనగా.. మీరు కాదు... నన్ను నేనే గుర్తుపట్టలేక పోయానని ఆయన చమత్కరించారు.












Click it and Unblock the Notifications