జగన్ ఆస్తులు ప్రకటిస్తారు: పిల్లి, భేటీలో 22 మంది

Pilli Subhash Chandra bose and Konda Surekha
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం తన ఆస్తులు ప్రకటిస్తారని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు ఆదివారం జగన్‌తో భేటీ అనంతరం చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్ని దొంగల లెక్కలు చూపారన్నారు. రాజీనామాలపై జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఎవరూ వెనక్కి తగ్గరన్నారు. 29 మంది కలిసి వస్తారన్నారు. జగన్ సోమవారం ఢిల్లీ వెళ్లి బిజెపి సహా విపక్షాలన్నింటినీ కలుస్తారని చెప్పారు. సోమవారం ఉదయం గవర్నర్ నరసింహన్, సాయంత్రం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిస్తామని చెప్పారు.

కాగా జగన్ భేటీలో 22 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన వారిలో నల్లిమిల్లి శేషారెడ్డి, బాబూరావు, పూతలపట్టు రవి, అమర్నాథ్ రెడ్డి, కుంజా సత్యవతి, చెన్నకేశవ రెడ్డి, కొర్ల భారతి, శ్రీనివాస్, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలరాజు, ప్రసాద్ రాజు, సుచరిత, శివప్రసాద్ రెడ్డి, శోభా నాగిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, రాజీనామా సమర్పించిన ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి హాజరయ్యారు.

భేటీకి ముందు శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సిగ్గుంటే మొదట పార్టీ రాజీనామాలు ఆమోదించాలన్నారు. పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ గతంలో రాజీనామా చేయగానే ఆమోదించారని ఇప్పుడు తమ రాజీనామాలు ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. తమ రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+