కడప పౌరుషం ఢిల్లీలో తాకట్టు: వైయస్ జగన్పై రేవంత్

ఐరన్ ఓర్ను అక్రమంగా తరలించిన గాలి జనార్ధన్ రెడ్డికి భారీ జరిమానా విధించాలని టిడిపి సీనియర్ నేతలు మండవ వెంకటేశ్వర రావు, కడియం శ్రీహరిలు డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకే గతంలో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో గనుల కేటాయింపు జరిగిందన్నారు. బ్రాహ్మిణి స్టీల్ అనుమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గాలి అక్రమాలపై తెలుగుదేశం పార్టీ మొదటి నుండి పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గనుల అక్రమాలలో కాంగ్రెసు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిదే పూర్తి బాధ్యత అన్నారు.












Click it and Unblock the Notifications